BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మున్సిపల్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
26 వీక్షణలు

జీవోలు 975, 673 రద్దు చేయాలని డిమాండ్.. 48 వేల మంది కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు: సీఐటీయూ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 14 రకాల పౌర సేవలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ అమలైతే ప్రజలపై యూజర్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీల రూపంలో అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 975, జీవో నెంబర్ 673లను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 48 వేల మంది మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడాలని కోరారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

అదనపు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో సీఐటీయూ నేతలు ఎస్వీ భద్రం, ఏ రవి తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.