BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
13 వీక్షణలు

‘నేను సీఎం అయ్యే సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’

నల్గొండ జిల్లా, మునుగోడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అయ్యే సమయం వస్తే తనను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని వ్యాఖ్యానించారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణపై ఢిల్లీలో చర్చలు, హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

‘మా ఇంట్లోకి, పార్టీలోకి వచ్చి మమ్మల్ని వెళ్లగొడతామని అంటే ఊరుకోం’ అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను పార్టీలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ కబ్జా చేయలేరని అన్నారు.

తన రాజకీయ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి అయ్యే సమయం వచ్చినప్పుడు తనను ఎవరూ అడ్డుకోలేరన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.