ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత
ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత
ఏలూరు జిల్లా ముసునూరు
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముసునూరు లోని ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకులం మరోసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కాకర్ల లక్ష్మీకుమారి తెలిపారు.
మొత్తం 80 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా అందరూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 70 మంది ప్రథమ శ్రేణిలో, 7 మంది ద్వితీయ శ్రేణిలో, 3 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
550 కంటే అధిక మార్కులు 9 మంది విద్యార్థినులు సాధించగా, 500 కంటే అధిక మార్కులు 34 మంది సాధించారు. తుమ్మల జ్యోతిర్మయి 573 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సి.హెచ్ సాయి వర్షిణి, యు. నాగ వైష్ణవి 563 మార్కులతో వరుసగా ద్వితీయ స్థానాల్లో నిలిచారు.
వంద శాతం ఫలితాలను మరోసారి నిలబెట్టిన విద్యార్థినులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు అభినందించారు.