ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక
ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
ఫోకస్ బూత్లు 82, 83 పరిధిలోని ఈ కుటుంబాలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సూచనల మేరకు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండేటి ఉదయ్ కిరణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని డెలారామ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఫోకస్ బూత్ అబ్జర్వర్ శేషపు శేషగిరిరావు పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీలో చేరిన కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ చేరికతో ముసునూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ప్రెసిడెంట్ దేవినేని శ్రీధర్, నక్క యోహాను, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.