BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 02:24 PM
71 వీక్షణలు

ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.

ఫోకస్ బూత్‌లు 82, 83 పరిధిలోని ఈ కుటుంబాలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సూచనల మేరకు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండేటి ఉదయ్ కిరణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని డెలారామ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఫోకస్ బూత్ అబ్జర్వర్ శేషపు శేషగిరిరావు పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీలో చేరిన కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ చేరికతో ముసునూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ప్రెసిడెంట్ దేవినేని శ్రీధర్, నక్క యోహాను, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.