BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 02:24 PM
108 వీక్షణలు

ముసునూరులో రాజకీయ మార్పులు.. టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.

ఫోకస్ బూత్‌లు 82, 83 పరిధిలోని ఈ కుటుంబాలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సూచనల మేరకు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండేటి ఉదయ్ కిరణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని డెలారామ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఫోకస్ బూత్ అబ్జర్వర్ శేషపు శేషగిరిరావు పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీలో చేరిన కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ చేరికతో ముసునూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ప్రెసిడెంట్ దేవినేని శ్రీధర్, నక్క యోహాను, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.