BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 07:43 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణకు చర్యలు

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
19 Sep, 2026 - 07:43 PM
86 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణ పనులపై అధికారులు పరిశీలన నిర్వహించారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో చర్చించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాలలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో బస్టాండ్‌ను ఆధునీకరించే ప్రతిపాదన ఉందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా పునరుద్ధరణ, ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల రాకపోకలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై అధికారులు వివరాలు అందించారు. పునరుద్ధరణ పనులను సమన్వయంతో చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.