BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 January 2026, 10:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
30 Jan, 2026 - 10:27 AM
380 వీక్షణలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ NTODAY NEWS: కలికిరి/పీలేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలికిరి మండలంలోని మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహణ, సేవల నాణ్యతపై సమగ్రంగా పరిశీలన చేపట్టారు. రిజిస్టర్ల పరిశీలన ఆసుపత్రికి సంబంధించిన ఓపీ రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్ తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చిన్నారులకు టీకాలు ఎప్పుడు, ఎలా వేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకాల తేదీలను ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నారా? టీకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై సిబ్బందిని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలపై దృష్టి సిబ్బంది కొరత ఉన్నట్లయితే వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించి, ప్రజలకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవాలు మరియు శస్త్రచికిత్సలు జరిగేలా చూడాలన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ స్త్రీలలో రక్తహీనత సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. పరిశుభ్రత తప్పనిసరి ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందికి స్పష్టం చేశారు. #GovernmentHospitals #InstitutionalDeliveries #PublicHealth #MaternalCare #DistrictCollector #HealthcareInspection Follow us on Website Facebook Instagram YouTube