యూపీహెచ్సీలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అనంతరం చింతలపూడి శాసనసభ్యులు స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యూపీహెచ్సీ) సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
యూపీహెచ్సీలో వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగుల నమోదు, వైద్య సేవలు, మందుల పంపిణీ తదితర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. అలాగే డేటా ఎంట్రీ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో స్వయంగా కంప్యూటర్ను ఆపరేట్ చేస్తూ పరిశీలించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. వైద్య సేవల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా సిబ్బంది పనిచేయాలని, రోగులకు అవసరమైన సేవలను సకాలంలో అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్రీన్, హెచ్డీఎస్ కమిటీ సభ్యులు సొంగా ఏసుపాదం, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.