BREAKING
టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్
www.ntodaynews.com

వికలాంగుల హక్కుల సాధనకు ఉద్యమం

తెలంగాణ
21 Feb, 2026 - 11:27 AM
204 వీక్షణలు
వికలాంగుల హక్కుల సాధనకు ఉద్యమం పెన్షన్ పెంపు, రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ ఎన్‌పిఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో పిలుపు NTODAY NEWS: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెన్షన్‌ను ₹6,000లకు పెంచాలని, స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎన్‌పిఆర్‌డీ నాయకులు డిమాండ్ చేశారు. ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. ఎన్‌పిఆర్‌డీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ జెండాను ఆవిష్కరించారు. కె. వెంకట్ మాట్లాడుతూ, జాలి, దయ కాదు, హక్కుల సాధన కోసం వికలాంగులను దేశవ్యాప్తంగా ఐక్యం చేయడమే లక్ష్యంగా 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో కలకత్తాలో ఎన్‌పిఆర్‌డీ స్థాపించబడిందన్నారు. వికలాంగుల సమస్యలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. 2016 ఆర్పీడీ చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డులు, రైల్వే సౌకర్యాలు, ప్రజా ప్రదేశాలను అవరోధ రహితంగా మార్చడం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ విలీనానికి వ్యతిరేకంగా పోరాటాలు వంటి అంశాల్లో సంఘం విజయాలు సాధించిందన్నారు. మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని ఆరోపించారు. పెన్షన్‌ను ₹6,000లకు పెంచడంతో పాటు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాలని, ప్రైవేట్ రంగంలో 5 శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సురుపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, నాయకులు కేతావత్ మురళి, శ్రీనివాస్ రెడ్డి, నాగు నరసింహ, పున్న శ్రీధర్, కర్ర కిషన్ తదితరులు పాల్గొన్నారు. సురుపంగా ప్రకాష్ జిల్లా అధ్యక్షుడు #NPRD #DisabilityRights #PensionDemand #ReservationRights #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube