BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 04 March 2026, 08:15 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

భావితరాలకు పౌరాణిక నాటకాలు స్ఫూర్తిదాయకం

తెలంగాణ
04 Mar, 2026 - 08:15 PM
309 వీక్షణలు
భావితరాలకు పౌరాణిక నాటకాలు స్ఫూర్తిదాయకం: మద్దుల గోపాల్ రెడ్డి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహిస్తున్న మహాభారత నాటక ప్రదర్శనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటుపడి సంస్కృతి, సంప్రదాయాలకు దూరమవుతున్నారని అన్నారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు చూసే అవకాశాలు కల్పిస్తే పిల్లలకు మన పూర్వీకుల గొప్పతనం తెలియడంతో పాటు నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. అలాగే సంప్రదాయ కళలు నిలిచి తర్వాతి తరాలకు అందుతాయని పేర్కొన్నారు. ఇలాంటి నాటక ప్రదర్శనలు ప్రతి గ్రామంలో నిర్వహించాలనీ, కళలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చే వారికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శన ఇస్తున్న కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి, గొడిసెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్, నాయకులు కొడిపెల్లి శ్రీనివాస్, బెడ్డల ప్రవీణ్, దర్శనాల నరేష్, మెరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్, సింగతి వెంకటస్వామి, నీలం శ్రీనివాస్, మొగిలి శేఖర్, గర్శకుర్తి దిలీప్, చిలువేరు వెంకటేష్, పంజా సాయి మరియు ఉమ్మడి వెల్గటూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Endapalli #Kothapeta #MahabharataNatakam #MaddulaGopalReddy #CulturalHeritage #TelanganaNews #Jagtial #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube