www.ntodaynews.com
భావితరాలకు పౌరాణిక నాటకాలు స్ఫూర్తిదాయకం
తెలంగాణ
భావితరాలకు పౌరాణిక నాటకాలు స్ఫూర్తిదాయకం: మద్దుల గోపాల్ రెడ్డి
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహిస్తున్న మహాభారత నాటక ప్రదర్శనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటుపడి సంస్కృతి, సంప్రదాయాలకు దూరమవుతున్నారని అన్నారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు చూసే అవకాశాలు కల్పిస్తే పిల్లలకు మన పూర్వీకుల గొప్పతనం తెలియడంతో పాటు నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. అలాగే సంప్రదాయ కళలు నిలిచి తర్వాతి తరాలకు అందుతాయని పేర్కొన్నారు.
ఇలాంటి నాటక ప్రదర్శనలు ప్రతి గ్రామంలో నిర్వహించాలనీ, కళలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చే వారికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శన ఇస్తున్న కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి, గొడిసెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్, నాయకులు కొడిపెల్లి శ్రీనివాస్, బెడ్డల ప్రవీణ్, దర్శనాల నరేష్, మెరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్, సింగతి వెంకటస్వామి, నీలం శ్రీనివాస్, మొగిలి శేఖర్, గర్శకుర్తి దిలీప్, చిలువేరు వెంకటేష్, పంజా సాయి మరియు ఉమ్మడి వెల్గటూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Endapalli #Kothapeta #MahabharataNatakam #MaddulaGopalReddy #CulturalHeritage #TelanganaNews #Jagtial #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube