ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
నాదెండ్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 28-05-2026 తేదీన నాదెండ్ల మండల క్లస్టర్-1 ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు మహానాడు వేదిక నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహానాడు వేదిక వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మహానాడు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
మహానాడు సందర్భంగా పార్టీ జాతీయ నాయకత్వం అందించిన సందేశాలను కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల క్లస్టర్-1 పరిధిలోని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.