www.ntodaynews.com
నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు
ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కాలువల పరిధిలో 2026-27 సంవత్సరానికి చేపట్టనున్న 578 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు రూ. 42.19 కోట్లు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
▪️ఈ నిధులతో నాగార్జున సాగర్ కాలువల పరిధిలో కాలువల బలోపేతం, డీసిల్టింగ్, నీటి నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, గేట్లు మరియు షట్టర్ల మరమ్మతులు, బ్యాంకుల పటిష్టీకరణ వంటి పనులు చేపట్టనున్నారు.
▪️ఈ పనుల ద్వారా గుంటూరు, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల పరిధిలోని నాగార్జున సాగర్ కాలువల ద్వారా సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు ప్రయోజనం కలగనుంది.