BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

నార్కట్‌పల్లి పోలీసుల సేవాకు డీజీపీ ఫిదా

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
22 Jun, 2026 - 08:14 PM
72 వీక్షణలు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటూ ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేని విద్యార్థులను తమ పోలీసు వాహనాలపై చేర్చి సహాయం చేశారు. దీంతో పలువురు విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాయగలిగారు. నార్కట్‌పల్లి పోలీసుల ఈ సేవలకు సంబంధించిన వీడియోను నల్లగొండకు చెందిన డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ట్యాగ్ చేశారు. వీడియోను వీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన పోలీసులను అభినందించారు. "వీరు అవార్డుకు అర్హులు" అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. డీజీపీ అభినందనలతో నార్కట్‌పల్లి పోలీసుల సేవలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించిన పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.