BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

నార్కట్‌పల్లి పోలీసుల సేవాకు డీజీపీ ఫిదా

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
22 Jun, 2026 - 08:14 PM
16 వీక్షణలు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటూ ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేని విద్యార్థులను తమ పోలీసు వాహనాలపై చేర్చి సహాయం చేశారు. దీంతో పలువురు విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాయగలిగారు. నార్కట్‌పల్లి పోలీసుల ఈ సేవలకు సంబంధించిన వీడియోను నల్లగొండకు చెందిన డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ట్యాగ్ చేశారు. వీడియోను వీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన పోలీసులను అభినందించారు. "వీరు అవార్డుకు అర్హులు" అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. డీజీపీ అభినందనలతో నార్కట్‌పల్లి పోలీసుల సేవలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించిన పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.