BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

నార్కట్‌పల్లి పోలీసుల సేవాకు డీజీపీ ఫిదా

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
22 Jun, 2026 - 08:14 PM
106 వీక్షణలు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటూ ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేని విద్యార్థులను తమ పోలీసు వాహనాలపై చేర్చి సహాయం చేశారు. దీంతో పలువురు విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాయగలిగారు. నార్కట్‌పల్లి పోలీసుల ఈ సేవలకు సంబంధించిన వీడియోను నల్లగొండకు చెందిన డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ట్యాగ్ చేశారు. వీడియోను వీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన పోలీసులను అభినందించారు. "వీరు అవార్డుకు అర్హులు" అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. డీజీపీ అభినందనలతో నార్కట్‌పల్లి పోలీసుల సేవలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం బాధ్యతగా వ్యవహరించిన పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.