BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:20 PM
22 వీక్షణలు

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

శ్రీకాళహస్తి: తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకొని చాలీచాలని ఆదాయాలతో జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని టిడిపి నాయకులు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు వైద్యం శాంతారాం, టిడిపి నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాయీ బ్రాహ్మణ నాయకుడు చొప్పెళ్ళ శ్రీనును నాయీ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, గురువారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు.

సాంప్రదాయిక వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులు ఆర్థిక, సామాజిక పరంగా ఎదగడానికి టిడిపి ఆవిర్భావం తర్వాతే మార్గాలు ఏర్పడ్డాయని నాయకులు తెలిపారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచారని, ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కూడా వారి సంక్షేమంపై దృష్టి పెట్టారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైద్యం శాంతారాం, ఈదర శ్రీనివాసులు, పుల్లేటికుర్తి రమేష్, కోట చంద్రశేఖర్, వంగపూడి వాసు తదితరులు పాల్గొన్నారు.