BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:20 PM
10 వీక్షణలు

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

శ్రీకాళహస్తి: తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకొని చాలీచాలని ఆదాయాలతో జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని టిడిపి నాయకులు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు వైద్యం శాంతారాం, టిడిపి నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాయీ బ్రాహ్మణ నాయకుడు చొప్పెళ్ళ శ్రీనును నాయీ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, గురువారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు.

సాంప్రదాయిక వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులు ఆర్థిక, సామాజిక పరంగా ఎదగడానికి టిడిపి ఆవిర్భావం తర్వాతే మార్గాలు ఏర్పడ్డాయని నాయకులు తెలిపారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచారని, ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కూడా వారి సంక్షేమంపై దృష్టి పెట్టారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైద్యం శాంతారాం, ఈదర శ్రీనివాసులు, పుల్లేటికుర్తి రమేష్, కోట చంద్రశేఖర్, వంగపూడి వాసు తదితరులు పాల్గొన్నారు.