BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:20 PM
97 వీక్షణలు

నాయీ బ్రాహ్మణులకు భరోసా ఇచ్చింది టిడిపినే!

శ్రీకాళహస్తి: తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకొని చాలీచాలని ఆదాయాలతో జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని టిడిపి నాయకులు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు వైద్యం శాంతారాం, టిడిపి నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాయీ బ్రాహ్మణ నాయకుడు చొప్పెళ్ళ శ్రీనును నాయీ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, గురువారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు.

సాంప్రదాయిక వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులు ఆర్థిక, సామాజిక పరంగా ఎదగడానికి టిడిపి ఆవిర్భావం తర్వాతే మార్గాలు ఏర్పడ్డాయని నాయకులు తెలిపారు. టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నిలిచారని, ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కూడా వారి సంక్షేమంపై దృష్టి పెట్టారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైద్యం శాంతారాం, ఈదర శ్రీనివాసులు, పుల్లేటికుర్తి రమేష్, కోట చంద్రశేఖర్, వంగపూడి వాసు తదితరులు పాల్గొన్నారు.