పల్స్ పోలియో... నిండు జీవితానికి రెండు చుక్కలు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి పట్టణంలోని ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్, చింతలపూడి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల దుర్గాపార్వతి మధుబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోతునూరు పీఏసీఎస్ చైర్మన్ శీతాల గాంధీ, గ్రంథాలయ డైరెక్టర్, మండల కార్యదర్శి పురేటి సునీత, పట్టణ ఉపాధ్యక్షుడు ఏజీఎస్ కుమార్ అనంత కుమార్, కురిశెట్టి శ్రీనివాస్, వెన్న సత్యనారాయణ, దాసిరెడ్డి సురేష్, కూటమి నాయకులు, డ్యూటీ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.