BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 08:45 PM
117 వీక్షణలు

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 20న సోమవారం అనగా నేడు, ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు తెలుగుదేశం పార్టీ-మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో “మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహిస్తున్నామని తెలిపారు. “రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ముత్తవరపు స్వర్ణ ఏసీ కన్వెన్షన్, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం వద్ద ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాలలో సాధారణ వ్యాధులు, గుండె, క్యాన్సర్, చెవి, కంటి, దంత మరియు ఎముకల పరీక్షలు, షుగర్, బీపీ మరియు రక్త పరీక్షలు, ఉచిత వినికిడి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయబడతాయి.

మైలవరం నియోజకవర్గంలోని కూటమి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.