BREAKING
దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పట్టుదలే విజయ రహస్యం : డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 43వ వారం జ్ఙానమాల కార్యక్రమం. పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పట్టుదలే విజయ రహస్యం : డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 43వ వారం జ్ఙానమాల కార్యక్రమం. పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు బుర్రి రమేష్ మృతికి చాట్రాయి మండల మాలయోధుల సంఘం ప్రగాఢ సానుభూతి
www.ntodaynews.com

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 08:45 PM
15 వీక్షణలు

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 20న సోమవారం అనగా నేడు, ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు తెలుగుదేశం పార్టీ-మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో “మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహిస్తున్నామని తెలిపారు. “రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ముత్తవరపు స్వర్ణ ఏసీ కన్వెన్షన్, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం వద్ద ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాలలో సాధారణ వ్యాధులు, గుండె, క్యాన్సర్, చెవి, కంటి, దంత మరియు ఎముకల పరీక్షలు, షుగర్, బీపీ మరియు రక్త పరీక్షలు, ఉచిత వినికిడి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయబడతాయి.

మైలవరం నియోజకవర్గంలోని కూటమి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.