BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 08:45 PM
51 వీక్షణలు

నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 20న సోమవారం అనగా నేడు, ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు తెలుగుదేశం పార్టీ-మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో “మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహిస్తున్నామని తెలిపారు. “రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ముత్తవరపు స్వర్ణ ఏసీ కన్వెన్షన్, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం వద్ద ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాలలో సాధారణ వ్యాధులు, గుండె, క్యాన్సర్, చెవి, కంటి, దంత మరియు ఎముకల పరీక్షలు, షుగర్, బీపీ మరియు రక్త పరీక్షలు, ఉచిత వినికిడి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయబడతాయి.

మైలవరం నియోజకవర్గంలోని కూటమి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.