నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం
నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 20న సోమవారం అనగా నేడు, ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరంతో పాటు, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరియు తెలుగుదేశం పార్టీ-మైలవరం నియోజకవర్గం ఆధ్వర్యంలో “మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహిస్తున్నామని తెలిపారు. “రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ముత్తవరపు స్వర్ణ ఏసీ కన్వెన్షన్, రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం వద్ద ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాలలో సాధారణ వ్యాధులు, గుండె, క్యాన్సర్, చెవి, కంటి, దంత మరియు ఎముకల పరీక్షలు, షుగర్, బీపీ మరియు రక్త పరీక్షలు, ఉచిత వినికిడి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయబడతాయి.
మైలవరం నియోజకవర్గంలోని కూటమి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.