www.ntodaynews.com
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులను కాపాడండి : సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్
అమరావతి : నేపాల్లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన ప్రజల వివరాలను సేకరించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
నేపాల్లో ఉన్న ఏపీ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి, వారికి తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులకు సూచించారు.
సమాచారం, సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్లు 011-23384016, 011-23387089 సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఏపీ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.