BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:24 PM
26 వీక్షణలు

నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్

నెల్లూరు జిల్లాలో అవినీతి ఘటన బహిర్గతమైంది. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామానికి చెందిన రైతు షేక్ సుకూర్ అహ్మద్ నుంచి లంచం తీసుకుంటుండగా లైన్మెన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రొయ్యల గుంటలను కొనుగోలు చేసిన ఫిర్యాదుదారుడు షేక్ సుకూర్ అహ్మద్, వాటిని తన భార్య నజీమా పేరుపై ఆన్‌లైన్‌లో బదిలీ చేయించేందుకు లైన్మెన్ రమేష్‌ను సంప్రదించాడు. ఈ ప్రక్రియ కోసం మొత్తం ₹1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే తొలివిడతగా ₹50,000 గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న రమేష్, మిగిలిన ₹1,00,000ను నేడు సబ్స్టేషన్ వద్ద తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.