నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్
నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్
నెల్లూరు జిల్లాలో అవినీతి ఘటన బహిర్గతమైంది. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామానికి చెందిన రైతు షేక్ సుకూర్ అహ్మద్ నుంచి లంచం తీసుకుంటుండగా లైన్మెన్ రమేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రొయ్యల గుంటలను కొనుగోలు చేసిన ఫిర్యాదుదారుడు షేక్ సుకూర్ అహ్మద్, వాటిని తన భార్య నజీమా పేరుపై ఆన్లైన్లో బదిలీ చేయించేందుకు లైన్మెన్ రమేష్ను సంప్రదించాడు. ఈ ప్రక్రియ కోసం మొత్తం ₹1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే తొలివిడతగా ₹50,000 గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న రమేష్, మిగిలిన ₹1,00,000ను నేడు సబ్స్టేషన్ వద్ద తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.