BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:24 PM
50 వీక్షణలు

నెల్లూరులో ఏసీబీ ట్రాప్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన లైన్ మెన్

నెల్లూరు జిల్లాలో అవినీతి ఘటన బహిర్గతమైంది. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామానికి చెందిన రైతు షేక్ సుకూర్ అహ్మద్ నుంచి లంచం తీసుకుంటుండగా లైన్మెన్ రమేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రొయ్యల గుంటలను కొనుగోలు చేసిన ఫిర్యాదుదారుడు షేక్ సుకూర్ అహ్మద్, వాటిని తన భార్య నజీమా పేరుపై ఆన్‌లైన్‌లో బదిలీ చేయించేందుకు లైన్మెన్ రమేష్‌ను సంప్రదించాడు. ఈ ప్రక్రియ కోసం మొత్తం ₹1,50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే తొలివిడతగా ₹50,000 గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న రమేష్, మిగిలిన ₹1,00,000ను నేడు సబ్స్టేషన్ వద్ద తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.