నేరడా బ్రిడ్జి కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మించాలంటూ కాసోజు శంకరాచారి నేతృత్వంలో 100 మందికి పైగా రైతులు, మహిళలు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు ఊర్ల మధ్య బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు స్తంభించి రైతులు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని . పంటలను మార్కెట్కు తరలించలేక రైతులు నష్టపోతున్నారు అని వాపోయారు రైతుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రోడ్డు మరియు భవనాల శాఖ అధికారులను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ భరోసాతో గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మహిళా రైతులు పాల్గొన్నారు.