BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో రహిత సమాజం అందరి లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:05 PM
64 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని విస్సన్నపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జననం నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి కొప్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ, "ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఉన్నా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. ప్రయాణంలో ఉన్నవారికి కూడా బస్టాండ్లలో ప్రత్యేక కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసే సౌకర్యం కల్పించాం" అని తెలిపారు.

మండల వ్యాప్తంగా మొత్తం 45 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్న రత్నాలు, ఈఓ హరీకుమార్, డిప్యూటీ డీటీ విజయ భాస్కర్, హెల్త్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.