BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
04 Jun, 2026 - 09:07 PM
41 వీక్షణలు

నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త – జూన్ 16న చిలకలూరిపేటలో మెగా జాబ్ మేళా : డాక్టర్  కందిమళ్ళ  సాంబశివరావు

చిలకలూరిపేట: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ, మాజీ మంత్రి మరియు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డాక్టర్  కందిమళ్ళ సాంబశివరావు  తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యను పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తులు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ చొరవతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలను చిలకలూరిపేటకు తీసుకువచ్చి స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు.


ఈ మెగా జాబ్ మేళాలో జోయాలుక్కాస్, డీమార్ట్, రిలయన్స్ జియో, టాటా క్యాపిటల్, కియా, ఐసుజు, ఎస్‌బీఐ కార్డ్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, క్వెస్, మహీంద్రా సీఐఈ, ఎంఆర్ఎఫ్ తదితర 40కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. వివిధ విభాగాల్లో 2,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.


ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


గతంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాల ద్వారా అనేక మంది యువత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారని గుర్తుచేసిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఈ జాబ్ మేళా కూడా వేలాది మంది నిరుద్యోగులకు ఆశాకిరణంగా నిలుస్తుందని అన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం 7779858789, 7842747682, 9848793357, 7702921219 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


ఇలాంటి యువతాభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు డాక్టర్  కందిమళ్ళ సాంబశివరావు అభినందనలు తెలిపారు.