BREAKING
శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! ​ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సత్తయ్య చేసిన సేవలు మరవలేనివి: నగర కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత ​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! ​ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సత్తయ్య చేసిన సేవలు మరవలేనివి: నగర కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత ​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు
www.ntodaynews.com

​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 06:22 PM
11 వీక్షణలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్, శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ వద్ద నివాసాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్యపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు మేయర్ ధర్ని మధుకర్ స్పందించి, తక్షణ పరిష్కారానికి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ సమీపంలో నివాసాల పై నుండి వెళ్తున్న ఎల్.టి. లైన్ల వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ దృష్టికి తీసుకువచ్చారు. మేయర్ మధుకర్ సంఘటనా స్థలానికి వెళ్లి నివాసాలను పరిశీలించి, సమస్యను అర్థం చేసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌తో ఫోన్ ద్వారా సంప్రదించి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మేయర్ చొరవతో విద్యుత్ లైన్ల మార్పునకు చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చర్యల వలన స్థానిక నివాసితులు భద్రతతో పాటు, విద్యుత్ సంబంధిత ప్రమాదాల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మేయర్ చూపిన చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, మేయర్ ధర్ని మధుకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్, ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు