BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 06:22 PM
62 వీక్షణలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్, శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ వద్ద నివాసాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్యపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు మేయర్ ధర్ని మధుకర్ స్పందించి, తక్షణ పరిష్కారానికి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ బస్టాండ్ మజీద్ సమీపంలో నివాసాల పై నుండి వెళ్తున్న ఎల్.టి. లైన్ల వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ దృష్టికి తీసుకువచ్చారు. మేయర్ మధుకర్ సంఘటనా స్థలానికి వెళ్లి నివాసాలను పరిశీలించి, సమస్యను అర్థం చేసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌తో ఫోన్ ద్వారా సంప్రదించి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మేయర్ చొరవతో విద్యుత్ లైన్ల మార్పునకు చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చర్యల వలన స్థానిక నివాసితులు భద్రతతో పాటు, విద్యుత్ సంబంధిత ప్రమాదాల నుండి ఉపశమనం పొందుతారని భావిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మేయర్ చూపిన చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, మేయర్ ధర్ని మధుకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్, ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు