Breaking News
తాజా బ్రేకింగ్ వార్తలు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి...
www.ntodaynews.com

నకిలీ మొబైల్ యాక్సెసరీస్‌పై విజిలెన్స్ పంజా

ఆంధ్రప్రదేశ్
గడ్డం జగన్మోహన్ రెడ్డి
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026
18 వీక్షణలు

ఏలూరులో మహదేవ్ మొబైల్స్‌లో ఆకస్మిక దాడులు

ఏలూరు, మార్చి 16: ఏలూరు నగరంలోని మొబైల్ యాక్సెసరీస్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. సోమవారం నగరంలోని ఆర్‌.ఆర్‌.పేటలో ఉన్న మహదేవ్ మొబైల్స్ దుకాణంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ (డూప్లికేట్) మొబైల్ యాక్సెసరీలను అసలు వస్తువులుగా నమ్మిస్తూ విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల్లో భాగంగా దుకాణంలోని సెల్‌ఫోన్ విడిభాగాలు, మొబైల్ యాక్సెసరీస్ స్టాక్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విక్రయాలకు సంబంధించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, ఒరిజినల్ సామాగ్రికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు.

నాణ్యతలేని వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం దుకాణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.