BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

నకిలీ మొబైల్ యాక్సెసరీస్‌పై విజిలెన్స్ పంజా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 02:44 PM
71 వీక్షణలు

ఏలూరులో మహదేవ్ మొబైల్స్‌లో ఆకస్మిక దాడులు

ఏలూరు, మార్చి 16: ఏలూరు నగరంలోని మొబైల్ యాక్సెసరీస్ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. సోమవారం నగరంలోని ఆర్‌.ఆర్‌.పేటలో ఉన్న మహదేవ్ మొబైల్స్ దుకాణంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ (డూప్లికేట్) మొబైల్ యాక్సెసరీలను అసలు వస్తువులుగా నమ్మిస్తూ విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల్లో భాగంగా దుకాణంలోని సెల్‌ఫోన్ విడిభాగాలు, మొబైల్ యాక్సెసరీస్ స్టాక్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విక్రయాలకు సంబంధించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, ఒరిజినల్ సామాగ్రికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు.

నాణ్యతలేని వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం దుకాణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.