నంద్యాల to గుంతకల్ నూతన రైలు సేవను ప్రారంభించిన బైరెడ్డి శబరి.
బైరెడ్డి శబరి నంద్యాల MP, TDP జాతీయ ప్రధాన కార్యదర్శి గారు 12-05-26 ఈరోజు గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మార్గంలో నూతన రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.
ప్రజల అవసరాలను గుర్తించి ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమంలో నేను ఎప్పుడూ ముందుంటాను. ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తాను.
ఈ రైలు సేవ లు విజయవంతంగా కొనసాగుతూ వేలాది కుటుంబాల ప్రయాణాన్ని సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బైరెడ్డి శబరి అన్నారు.