నంద్యాలలో దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్ విడుదల
నంద్యాలలో ‘దళిత క్రైస్తవుల గర్జన’ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ‘చలో నంద్యాల - దళిత, క్రైస్తవుల గర్జన’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం మరియు వారి హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వచ్చే మే 09, 2026 (శనివారం) ఉదయం 9:00 గంటలకు నంద్యాలలోని దేవనగర్, ఎస్.పి.జి గ్రౌండ్స్ నందు గల రైడర్ మెమోరియల్ హాల్లో ఈ భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒకరికి ఒకరు సహకరించుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, రాజ్ మహేంద్ర, కార్యక్రమ కన్వీనర్లు యనమల రాజ్కుమార్, వెల్పుల విజయ్కుమార్, టిడిపి నాయకులు జార్జ్ ఇమ్మాన్యుయేల్, సౌభాగ్య, సురేష్ మరియు వివిధ దళిత, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ గర్జన సభకు దళిత క్రైస్తవ సోదర సోదరీమణులు, మేధావులు, రాజకీయ నాయకులు, యువత మరియు ప్రజా సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సభకు విచ్చేసే వారందరికీ భోజన వసతి కల్పించబడుతుందని వారు తెలియజేశారు.