www.ntodaynews.com
నంద్యాలలో యువకుడి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాలలో యువకుడి దారుణ హత్య, నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
N.కొత్తపల్లి మెట్ట సమీపంలో యువకుడిని వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మృతుడు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన షేక్ కరిముల్లా (28)గా గుర్తించారు. కొత్తపల్లి – భీమవరం రోడ్డులో దుండగులు అతడిని వెంటాడి, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు భార్య తరఫున బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.