www.ntodaynews.com
నూజివీడు ఎక్సైజ్ స్టేషన్లో మొక్కలు నాటిన అధికారులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు ఎక్సైజ్ స్టేషన్లో మొక్కలు నాటిన అధికారులు
నూజివీడు: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో వివిధ రకాల పండ్ల, పుష్పించే, నీడనిచ్చే మొక్కలను ఎక్సైజ్ అధికారులు నాటారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ వాటి ఎదుగుదలకు అవసరమైన నీటి సరఫరా, ఇతర సంరక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.