BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

నూజివీడు ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 04:56 PM
117 వీక్షణలు

ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కే.వి. నాగ ప్రభు కుమార్ నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించిన అధికారులు, అనంతరం సిబ్బందితో సమావేశమై స్టేషన్ పనితీరును సమీక్షించారు. గత ఏడాది కాలంగా అదుపులో ఉన్న ఐ.డి. మద్యం (ఇల్లిసిట్ డిస్టిల్డ్ లిక్కర్) తయారీ, విక్రయాలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో ఐ.డి. మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్-129 కింద కేసులు నమోదు చేయాలని, పరారీలో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. అలాగే పునరావాస చర్యలు చేపట్టడంతో పాటు వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిరంతర తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని, ప్రజలు బహిరంగంగా మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.