BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

నూజివీడులో ముమ్మర వాహన తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 06:29 AM
50 వీక్షణలు

నూజివీడు, ఏలూరు జిల్లా: నూజివీడు పట్టణంలోని ప్రధాన కూడలి బస్టాండ్ సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణవేణి, ప్రవీణ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, సరైన పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిని గుర్తించి జరిమానాలు విధించారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడటం వంటి ప్రమాదకర చర్యలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మైనర్లు వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించడం, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి తప్పనిసరి పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు వాహనాలను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు అత్యంత అవసరమని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.