నూజివీడులో రాజకీయ వేడి పెంచనున్న AMC ప్రమాణ స్వీకారం..!
నూజివీడు పట్టణంలోని మార్కెట్ యార్డు రేపు రాజకీయ సందడికి వేదిక కానుంది.
14-05-2026 గురువారం సాయంత్రం 5 గంటలకు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరుకానుండటంతో కూటమి శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
మార్కెట్ యార్డు ప్రాంగణం మొత్తం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, నినాదాలతో కళకళలాడనుండగా… భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరానున్నారు.
స్థానిక రాజకీయాల్లో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా బీజేపీ ఎస్పీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి పిలుపునిచ్చారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కార్యక్రమాన్ని విస్తృతంగా కవర్ చేయాలని కోరారు.