పెనుగొలనులో 101వ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మహోత్సవాలు
పెనుగొలనులో జాతీయ పోషకాహార మహోత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 101వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం జాతీయ పోషకాహార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యత, నాణ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాల సేవలు కీలకమని తెలిపారు. రోజువారీ ఆహారంలో సీజన్కు అనుగుణంగా లభించే ఆకుకూరలు, తాజా పండ్లు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. కుటుంబ ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ఇంటి ప్రాంగణంతో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. భోజనం చేసే ముందు, వంట చేయడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. పరిశుభ్రమైన ఆహారం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా చిన్నారులు, మహిళలు ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు దేవర దివ్య, పీవీ సాయి లక్ష్మి, బి. నాగమణి, కె. లింగమ్మతో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.