www.ntodaynews.com
నవోదయ ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
జాతీయం
నవోదయ ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంతకుముందు ఆగస్టు 1 రాత్రి 11:59 గంటలతో ముగియాల్సిన గడువును ఆగస్టు 7 వరకు పెంచినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రవేశ పరీక్షను నవంబర్ 28న నిర్వహించనున్నారు. పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పించబడతాయి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ (https://navodaya.gov.in)లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.