NSS ప్రత్యేక శిబిరం ప్రారంభం.
NTODAY NEWS: పుంగనూరు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆద్వర్యంలో NSS ప్రత్యేక శిబిరం భగత్ సింగ్ కాలనీలోని మునిసిపల్ ప్రైమరీ పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రత్యేక శిబిరం 01-12-2025 నుండి 07-12-2025 వరకు జరుగునని ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవాభావాన్ని క్రమశిక్షణను అలవర్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ నాయుడు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి విద్యార్థులు ప్రజలందరికీ పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యమ్మ ఆరోగ్య విషయాలపై స్థానిక పాఠశాలలోని విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన పెంపొందించి విద్యార్థులు హాజరు శాతం పెంపొందించే చర్యలు చేపట్టాలని NSS వాలంటీర్లకు సూచించారు. స్థానిక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బరాజు విద్యార్థులందరూ సేవాభావంతో సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు పుంగనూరులోని వీధులలో మరియు భగత్ సింగ్ కాలనీలో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కోసం ర్యాలీని నిర్వహించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube