www.ntodaynews.com
ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం
తెలంగాణ
సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు
అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరగనున్న సుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న **10, 11 తేదీలలో నిర్వహించనున్న గంగమ్మ జాతర మహోత్సవానికి సంబంధించి మౌలిక వసతులు, ట్రాఫిక్ నిర్వహణ, మెడికల్ క్యాంపులు మరియు ఫైర్ ఇంజిన్ల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, ఇన్స్టంట్ టాయిలెట్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు కల్పించనున్నట్లు తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష మాట్లాడుతూ పుంగనూరులో వైభవంగా జరిగే గంగమ్మ జాతరకు మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జమిందార్, ఏడి శ్రీనివాసులు, ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#Punganur #AnnamayyaDistrict #GangammaJatara #Sugutur #TempleFestival #AndhraPradeshNews #LocalNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube