BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కాపాడిన ఆటో డ్రైవర్.. మానవత్వానికి పోలీసుల ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 12:58 PM
46 వీక్షణలు

ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కాపాడిన ఆటో డ్రైవర్.. మానవత్వానికి పోలీసుల ప్రశంసలు

ఏ. కొండూరు, జూలై 19: ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరులో ఆటో డ్రైవర్ చూపిన మానవత్వాన్ని పోలీసులు అభినందించారు. పోలిశెట్టిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వాసం ప్రేమ్‌చంద్ జాతీయ రహదారిపై ఒంటరిగా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడిని గుర్తించి వెంటనే తన ఆటోను ఆపి సురక్షితంగా తన వద్ద ఉంచుకున్నాడు.

బాలుడిని ఆరా తీయగా హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పడంతో ఆలస్యం చేయకుండా ఏ. కొండూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బాలుడి వివరాలను నిర్ధారించి, కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం అతడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

ఆటో డ్రైవర్ ప్రేమ్‌చంద్ చూపిన బాధ్యతాయుతమైన సేవలను అభినందిస్తూ ఏ. కొండూరు ఎస్సై జి. మహాలక్ష్ముడు సన్మానించారు. ఈ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు సహాయకారిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.