BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
59 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లు 229, 230, 231లను సందర్శించి జరుగుతున్న ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, ఓటర్ల జాబితా భద్రత, పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో ఎలాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదని, అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ ఏ. కుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.