ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అపోహలు వద్దు – ఇంటింటి సర్వేను సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి గ్రామంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అర్హత కలిగిన ప్రతి వయోజనుడు తమ ఓటు హక్కును పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్ల పరిధిలో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, అంబటి చలపతిరావు, చెన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరుగంటి రామారావు, ఓరుగంటి శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.