www.ntodaynews.com
ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులకు రీ-వెరిఫికేషన్.. ఆధారాలతో హాజరు కావాలి
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులకు రీ-వెరిఫికేషన్.. ఆధారాలతో హాజరు కావాలి
సారిపల్లి గ్రామం : ఓటర్ల జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్న వారికి రీ-వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు బీఎల్ఓ (BLO) తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, పేరులో స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లయితే ఆగస్టు 22న గ్రామ సచివాలయానికి అవసరమైన ఆధార పత్రాలతో హాజరు కావాలని బీఎల్ఓ సూచించారు.
ఓటర్ల వివరాల సవరణకు సంబంధించిన ఆధార పత్రాలను వెంట తీసుకురావాలని, రీ-వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరారు.
ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీఎల్ఓ సూచించారు.