www.ntodaynews.com
ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన.. జులై 31 నాటికి ముసాయిదా జాబితా ముద్రణ: ఆర్వీ కర్ణన్
తెలంగాణ
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు. జులై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను ముద్రిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు.
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ కింద దాదాపు 22 లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని, మరో 25 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉందని తెలిపారు.
ఈ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు)తో పాటు అన్ని రాజకీయ పార్టీల తరఫున బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా పాల్గొంటారని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.