www.ntodaynews.com
ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ
తెలంగాణ
అంత్యోదయ దివస్ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ
NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రతినిధి బోరా శివారెడ్డి
గొల్లప్రోలు పట్టణ బీజేపీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని అంత్యోదయ దివస్గా ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, 1916 సెప్టెంబర్ 25న జన్మించిన దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్ర మానవతావాదం (ఏకాత్మ మానవతావాదం) అనే రాజకీయ తత్వాన్ని ప్రతిపాదించారని తెలిపారు. ప్రతి మానవుని శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల సమగ్ర వికాసమే సమాజ పురోగతికి పునాది అని ఆయన భావించారని వివరించారు. భారత్ స్వావలంబన దేశంగా ఎదగాలని, పాశ్చాత్య సిద్ధాంతాలపై పూర్తిగా ఆధారపడకూడదని ఉపాధ్యాయ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.
భారతీయ జనసంఘ్కు సిద్ధాంతాత్మక దిశానిర్దేశం చేసిన నేతగా, అనంతరం భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకుడిగా ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్రి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మేడసాని కామరాజు, కోశాధికారి పెద్దిశెట్టి మహేష్, ఓబీసీ నాయకుడు చీపూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
#DeendayalUpadhyaya
#AntyodayaDiwas
#IntegralHumanism
#BJP
#JanSangh
#PoliticalIdeology
#Gollaprolu
#KakinadaDistrict
#Tribute
Follow us on
Website
Facebook
Instagram
YouTube