BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పాప్రికా మిర్చి కాంట్రాక్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
55 వీక్షణలు

ఏలూరు జిల్లా, లింగపాలెం, జూన్ 26: లింగపాలెం మండలంలోని లింగపాలెం గ్రామంలో కర్షక్ మిత్ర, లింగపాలెం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాప్రికా మిర్చి కాంట్రాక్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా యాక్సిస్ డెవలప్మెంట్ సర్వీసెస్ సీనియర్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ, కర్షక్ మిత్ర ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం రైతులకు ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించబడిందని తెలిపారు. మార్కెట్‌లో ధరలు మారుతున్నా రైతులకు ముందుగానే మిర్చి కొనుగోలు ధరను నిర్ణయించడం ద్వారా ఆదాయానికి భరోసా కల్పిస్తామని చెప్పారు.

అలాగే పంట సాగు నుంచి కొనుగోలు వరకు ప్రతి అంశాన్ని రైతులతో చర్చించి, పరస్పర అంగీకారంతోనే కొనుగోలు ప్రక్రియ చేపడతామని వివరించారు. దీంతో రైతులు మార్కెట్ అనిశ్చితిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కర్షక్ మిత్ర మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సంజయ్, అశోక్, గ్రామోదయ ట్రస్టింగ్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌తో పాటు లింగపాలెం మండలం పరిసర ప్రాంతాలకు చెందిన పాప్రికా మిర్చి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.