BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:05 am
Posted by : కూనురు మధు

పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Sep, 2026 - 10:05 AM
29 వీక్షణలు


తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలిచారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత  పాఠశాలలో 2008–2009 విద్యా సంవత్సరంలో 7వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు పాఠశాల అవసరాలను గుర్తించి సుమారు రూ.20 వేల విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేశారు. పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే సంకల్పంతో ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు కంప్యూటర్ టేబుల్, స్టీల్ బీరువా, 10 కుర్చీలను పాఠశాల యాజమాన్యానికి అందించారు. చిన్ననాటి బడిని మర్చిపోకుండా, తాము ఉన్నత స్థాయికి ఎదిగిన అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల చొరవ ఇతర బ్యాచ్‌ల విద్యార్థులకు సైతం స్ఫూర్తిదాయకమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.