BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:18 am
Posted by : ఈడూరి డేవిడ్

సీసీ, బీటీ రోడ్లకు రూ.6.07 కోట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
08 Sep, 2026 - 10:18 AM
9 వీక్షణలు

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం.. మారంపల్లిలో పనులకు భూమిపూజ

ద్వారకాతిరుమల | Ntoday News

ద్వారకాతిరుమల మండల ప్రజల దశాబ్దాల రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మారంపల్లి నుంచి తిరుమలపాలెం అడ్డరోడ్డు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్న రహదారి నిర్మాణానికి రూ.6.07 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నిధులతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

మంగళవారం మారంపల్లి గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతిరుమల మండల టీడీపీ అధ్యక్షుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేకు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.

మారంపల్లి–తిరుమలపాలెం రహదారి నిర్మాణానికి రూ.6.07 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ద్వారకాతిరుమల మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు దేవరపల్లి వీరాస్వామి చౌదరి, గోపాలపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పాతూరి సహృదయ, మండల పార్టీ నాయకులు నాదెళ్ల వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుకూరి విశ్వేశ్వరరావు, నాదెళ్ల సురేంద్రనాథ్ చౌదరి, నాదెళ్ల వేణు, దేవరపల్లి హేమంత్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.