BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 10:11 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వినాయక మండపాలకు ఆన్‌లైన్ పోలీసు అనుమతి తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Sep, 2026 - 10:11 AM
6 వీక్షణలు

మదనపల్లెలో శాంతి కమిటీ సమావేశం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మదనపల్లె | Ntoday News

వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వినాయక మండపాల ఏర్పాటు, భద్రత, నిమజ్జనం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు.

వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు.

ప్రతి వినాయక మండపం వద్ద తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలని అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్ల వినియోగం చేయరాదని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం సమయంలో ఎవరూ మద్యం సేవించరాదని సూచించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నిబంధనలను ఉల్లంఘించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. పండుగను అందరూ పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటాద్రి, పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.