BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 08 September 2026, 01:42 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూరు మండలంలో బీఆర్‌ఎస్‌ మహిళల ధర్నా

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
08 Sep, 2026 - 01:42 PM
5 వీక్షణలు

మహిళా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన

తొర్రూరు | Ntoday News

అసెంబ్లీలోకి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై జరిగినట్లు పేర్కొంటున్న దాడిని ఖండిస్తూ తొర్రూరు మండలంలో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

మహిళా ఎమ్మెల్యేల పట్ల అవమానకరంగా వ్యవహరించడం యావత్ మహిళా సమాజాన్ని అవమానించడమేనని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. మహిళల గౌరవం, హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు.

మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

– పాలకుర్తి రిపోర్టర్ వేణు