ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంv
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు మంగళవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా చిట్యాల పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో వ్యాపారి బండారు జనార్ధన్ మృతి చెందిన నేపథ్యంలో ఫ్లైఓవర్ పనులను వెంటనే వేగవంతం చేయాలని కోరారు. పట్టణంలోని పారిశుద్ధ్యం, మరుగుకాలువల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంతో పాటు పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కోరారు. రెండో వార్డులో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యుత్ స్తంభాలు, లో-వోల్టేజ్, రాత్రి వేళల్లో లైటింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పదో వార్డులో ఓపెన్ డ్రైనేజీపై స్లాబ్ నిర్మించాలని, మేడం పండు కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ను ₹4,016కు పెంచి అందించాలని, వంట గ్యాస్ సిలిండర్ను ₹500కే అందించాలని, ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.