పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- వైద్య నిధుల అనుమతి పత్రం అందజేత
NTODAY NEWS మంచిర్యాల:ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు తానున్నానంటూ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గం, హాజీపూర్ మండలం, బుద్దిపల్లి (కొండాపూర్) గ్రామానికి చెందిన అల్లంల అంజయ్య మోకాలి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో చికిత్స పొందుతుండగా, వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ రాసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన వైద్య నిధుల అనుమతి పత్రాన్ని అత్యంత వేగంగా మంజూరు చేయించారు. ఈ మంజూరైన సహాయక పత్రాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సకాలంలో స్పందించి తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన శాసనసభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు మరియు బుద్దిపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు