BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 06:12 PM
214 వీక్షణలు

పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. రైతులకు మోరంపూడి శ్రీనివాసరావు సూచనలు

చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో సోమవారం రైతు సేవా కేంద్రం సందడిగా మారింది. సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు రైతులకు కీలక సూచనలు చేశారు.

రసాయన ఎరువుల వినియోగంతో భూములు క్రమంగా సారాన్ని కోల్పోతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు రైతులకు వరంగా మారుతున్నాయని అన్నారు. ఈ పంటలను సాగు చేసి భూమిలో కలపడం వల్ల నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వివరించారు. అంతేకాకుండా తర్వాత వేసే పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు సహజంగానే లభించి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.

“భూమిని కాపాడితేనే రైతు భవిష్యత్తు బాగుంటుంది.. పచ్చిరొట్ట పంటలు రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తాయి” అంటూ మోరంపూడి రైతులకు పిలుపునిచ్చారు. రైతులు కూడా ఆసక్తిగా సూచనలు విన్నారు.

కార్యక్రమంలో వీఏఏ నాగమణి, రైతులు జక్కంపూడి ప్రదీప్, గవర వెంకటేశ్వరరావు, ముద్దుల శ్రీనివాసరావు, గోపాలరావు, మోరంపూడి త్రిమూర్తి, మేడా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.