పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
మదనపల్లి, జూన్ 02: అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి, ఇంటర్మీడియట్
సప్లిమెంటరీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాల్రాక్టీస్కు అస్సలు తావులేకుండా ఉండేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశాము.
మదనపల్లి, రాయచోటితో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను డ్రోన్ల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, పరీక్షా కేంద్రాల సమీపంలో అనుమానాస్పదంగా సంచరించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరడమైనది.