www.ntodaynews.com
పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం
పల్నాడు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తండ్రీ, కూతురు ఇద్దరూ కలిసి ఉత్తీర్ణులై అందరినీ ఆకట్టుకున్నారు.
రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన బాబురావు (42) సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్గా పనిచేస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన అతను, తన కూతురు చిట్టితో కలిసి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.
కూతురు 448 మార్కులు సాధించగా, బాబురావు 257 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా చదువు పట్ల ఆసక్తి ఉంటే సాధ్యం అని ఈ తండ్రీకూతుళ్లు నిరూపించారు.
ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో తల్లి-కొడుకు కూడా కలిసి పదో తరగతి ఉత్తీర్ణులైన సంఘటన వెలుగులోకి వచ్చింది.