www.ntodaynews.com
పదోన్నతి పై వెళ్లిన డిటి నిజాముద్దీన్ ఘనంగా వీల్కొడు పలికిన రెవెన్యూ అధికారులు
తెలంగాణ
/
కరీంనగర్
/
కరీంనగర్ అర్బన్
పదోన్నతిపై వెళ్లిన డిటి నిజాముద్దీన్కు ఘన వీడ్కోలు
రెవెన్యూ అధికారుల సత్కారం
వీణవంక
వీణవంక మండల తహసీల్దార్ కార్యాలయంలో గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన నాయబ్ తహసీల్దార్ నిజాముద్దీన్ ఇటీవల తహసీల్దార్గా పదోన్నతి పొంది జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి నిజాముద్దీన్ను పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా విధి నిర్వహణలో సహకరించిన ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు, కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.